తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2021, 3:24 PM IST

ETV Bharat / state

కొవిడ్ టీకా దేశానికే గర్వకారణం :మర్రి జనార్థన్​రెడ్డి

నాగర్​కర్నూల్​ జిల్లాలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్​రెడ్డి ప్రారంభించారు. మెదటి దశలో వైద్య ఆరోగ్య కార్యకర్తలకు, అంగన్వాడీ సిబ్బందికి మాత్రమే టీకా వేయనున్నట్లు ఆయన తెలిపారు.

mla marri janardhan reddy says the country is proud of the availability of the vaccine
టీకా అందుబాటులోకి రావడం దేశానికే గర్వకారణం:మర్రి జనార్థన్​రెడ్డి

కొవిడ్​ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్థన్​రెడ్డి అన్నారు. జిల్లాలోని తిమ్మారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాగర్​కర్నూల్​ జిల్లాలోని వెల్దండ, తిమ్మాజీపేటలో కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్లో 30 మందికి చొప్పున వాక్సిన్​ ఇచ్చారు. మెుదటి దశలో వైద్య ఆరోగ్య కార్యకర్తలకు, అంగన్వాడీ సిబ్బందికి టీకాలు ఇవ్వనున్నామని డాక్టర్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4,963 మందికి వ్యాక్సిన్​ ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రాబోయే ఎన్నికల్లో తెరాస సత్తా చాటాలి : మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details