తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పలపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి - mla marri janardan reddy started development works at ippalapally

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి పాల్గొన్నారు. ఇప్పలపల్లి గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణాన్ని ఆయన భూమి పూజ చేశారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.

rythu vedika bhumi pooja by mla marri janardhan art ippalapally
ఇప్పలపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి

By

Published : Jul 27, 2020, 6:14 PM IST

నాగర్​కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి భూమి పూజ చేశారు. ఈ రైతు వేదికను రూ. 22 లక్షలతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.

రైతులకు సబ్సిడీ రూపంలో ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడానికి సేవా కేంద్రం ఉపయోగపడుతుందని.. ఈ అవకాశాన్ని అన్నదాతలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను తీర్చేందుకు రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు మర్రి జనార్దన్​రెడ్డి వెల్లడించారు.

ఇవీ చూడండి:కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details