తెలంగాణ

telangana

By

Published : May 24, 2021, 2:34 PM IST

ETV Bharat / state

ఐసోలేషన్ వార్డు ఏర్పాటును పరిశీలించి ఎమ్మెల్యే, కలెక్టర్

కోరనా సోకి హోం ఐసోలేషన్​లో ఉండలేని నాగర్ కర్నూల్ జిల్లా పేద ప్రజల కోసం కేజీబీవీ పాఠశాలలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనులను ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శర్మన్​లు పరిశీలించారు.

mla and collector visited pentlavelli hospital
ఐసోలేషన్ వార్డు ఏర్పాటును పరిశీలించి ఎమ్మెల్యే, కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కరోనా బాధితుల అవసరార్థం కేజీబీవీ పాఠశాలలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కలెక్టర్ శర్మన్​లు పరిశీలించారు. అనంతరం పెంట్లవెల్లిలో నిర్వహిస్తున్న ఇంటింటికీ జ్వర సర్వే గురించి ఆశా కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.

కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సమస్యల గురించి వైద్యులతో చర్చించారు. ఆక్సిజన్ సిలిండర్​ల కొరత లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. ప్రజలందరూ కరోనా కట్టడి కోసం పోలీసులు, వైద్యులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని తెలిపారు.

ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details