తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​, భాజపా మధ్యనే పోరు: మల్లు రవి

ప్రస్తుతం రాష్ట్రంలో 75 శాతం నియంతృత్వ పాలన జరుగుతోందని నాగర్​ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా  అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

By

Published : Mar 25, 2019, 11:47 AM IST

అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నీ నెరవేరుస్తాం

కేంద్రంలో కాంగ్రెస్​, భాజపా మధ్యనే ఎన్నికల పోరు జరుగుతోందని నాగర్​కర్నూల్​ కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు రవి అన్నారు. తెరాసను గెలిపిస్తే హస్తినాకు వెళ్లి మోదీ దగ్గర జీ హుజూర్ అనాల్సిందే తప్ప చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రామిరెడ్డి, సంపత్​ కుమార్​, గద్వాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నీ నెరవేరుస్తాం

ABOUT THE AUTHOR

...view details