తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2020, 9:41 PM IST

ETV Bharat / state

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్​లో గాంధీ జయంతి వేడుకలు

గాంధీ జయంతి వేడుకలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్​లో ఘనంగా నిర్వహించారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. జిల్లా అదనపు కలెక్టర్​లు మను చౌదరి, హనుమంత్ రెడ్డి జిల్లా శాఖ అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

mahathma gandi birthday celebrations at nagar kurnool collectorate
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్​లో గాంధీ జయంతి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్​లో జాతిపిత మహాత్మా గాంధీ 151 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్​లు మను చౌదరి, హనుమంత్ రెడ్డి జిల్లా శాఖ అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.

స్వాతంత్య్ర సాధనలో బాపూ కృషిని వారు స్మరించుకున్నారు. ఆయన త్యాగ ఫలితాన్ని ఈ రోజు మనం పొందుతున్నామని పేర్కొన్నారు. మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'హాథ్రస్​'పై దద్దరిల్లిన దిల్లీ- నిరసనల్లో కేజ్రీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details