తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2019, 9:03 AM IST

ETV Bharat / state

కొల్లాపూర్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పాల్గొన్నారు.

కొల్లాపూర్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా చేపట్టిన యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. బాపూజీ ఆశయాలు ఐదో తరం ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.

కొల్లాపూర్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్

ABOUT THE AUTHOR

...view details