ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మూగజీవాలపై కర్కశం.. 12 మంది బైండోవర్ - Somasila krishna river news
![ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మూగజీవాలపై కర్కశం.. 12 మంది బైండోవర్ ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కృష్ణానదిలో మూగజీవాల తరలింపుపై అధికారుల స్పందన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10058527-837-10058527-1609324571974.jpg)
15:26 December 30
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కృష్ణానదిలో మూగజీవాల తరలింపుపై అధికారుల స్పందన
నాగర్కర్నూలు జిల్లా కృష్ణానదిలో మూగ జీవాల తరలింపుపై ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. కృష్ణా నదిలో మూగజీవాల తరలింపు ఘటనపై అధికారులు స్పందించారు. 12 మంది బోటు యజమానులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. కృష్ణానదిలో బోటు యజమానులు ప్రమాదకరంగా ప్రయాణికులను తరలిస్తున్నారు.
మూగజీవాలను నదిలో ఈతకొట్టిస్తూ ప్రమాదకర రీతిలో తరలిస్తున్నారు. సోమశిల నుంచి ఏపీలోని గ్రామాలకు నాటు పడవల్లో తరలిస్తున్నారు.
ఇదీ చూడండి:2020 రౌండప్ : రాజధానిలో సంచలనం సృష్టించిన కేసులివే..!