తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ - Nagarkarnool district collector sridhar

రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇవాళ ముగ్గురికి కరోనా వచ్చినట్లు కలెక్టర్​ శ్రీధర్​ పేర్కొన్నారు. ముగ్గురు బాధితులు గాంధీలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

Corona positive for three people from Nagarkarnool district
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్

By

Published : Jun 23, 2020, 12:25 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు కలెక్టర్​ శ్రీధర్​ పేర్కొన్నారు. బాధితులు కొన్నేళ్లుగా హైదరాబాద్​లోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. వెల్దండ మండలం తాండ్రకు చెందిన వ్యక్తికి, నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లికి చెందిన వ్యక్తికి, బిజినేపల్లి మండలం గంగారానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ప్రకటించారు. ముగ్గురు బాధితులు గాంధీలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details