తెలంగాణ

telangana

నాగర్​కర్నూలు కలెక్టరేట్​లో కాంగ్రెస్​ శ్రేణుల నిరాహారదీక్ష

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయం ముందు కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. అమ్రబాద్​ సర్పంచ్​పై సస్పెన్షన్​ వేటు ఎత్తివేస్తామని జేసీ హనుమంత్​రెడ్డి హామీ ఇవ్వగా కాంగ్రెస్​ నేతలు విరమించారు.

By

Published : Nov 5, 2020, 3:58 PM IST

Published : Nov 5, 2020, 3:58 PM IST

congress leaders protest at nagarkurnool district
నాగర్​కర్నూలు కలెక్టరేట్​లో కాంగ్రెస్​ శ్రేణుల నిరాహారదీక్ష

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో అమ్రాబాద్​ సర్పంచ్​ శారదపై సస్పెన్షన్​ వేటు ఎత్తివేయాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయనకు మద్దతుగా మాజీ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని గాంధీ ధర్నాచౌక్​ నుంచి కలెక్టర్​ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కలెక్టరేట్​ ఆవరణలో రెండు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్​ పార్టీ సర్పంచులకు తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ధర్నా చేపడతామని దీక్ష విరమించే ప్రసక్తే లేదని అన్నారు. చివరికి అదనపు కలెక్టర్ హనుమంత్​ రెడ్డి హామీ ఇస్తూ సస్పెన్షన్​ వేటు ఎత్తివేసినట్లు ఆర్డర్​పత్రం ఇవ్వగా దీక్ష విరమించారు.

ఇదీ చూడండి:'రెండు పడకల గదుల ఇళ్లను అమ్ముకునే వారిపై కేసులు'

ABOUT THE AUTHOR

...view details