తెలంగాణ

telangana

ETV Bharat / state

కొల్లాపూర్​లో కాంగ్రెస్ బంద్... నాయకుల అరెస్ట్ - కొల్లాపూర్​లో కాంగ్రెస్ నేతలు అరెస్ట్

నాగర్​ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో రాము యాదవ్​ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్టాండ్​లో బైఠాయించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నియంతలా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు దగ్గరలో ఉందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

congress leaders arrest at kollapur in nagarkurnool
కొల్లాపూర్​లో కాంగ్రెస్ నాయకులు అరెస్ట్

By

Published : Oct 21, 2020, 12:18 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం వద్ద మునిగిపోయిన పంపుహౌస్​ను చూడడానికి వచ్చిన కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలను పోలీసులు అడ్డుకోవడం వల్ల... ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాము యాదవ్ బృందం బస్టాండ్​లో బైఠాయించారు. వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపుతో నిరసన చేపట్టిన తమని అరెస్ట్ చేయడం దారుణమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతలా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు దగ్గరలో ఉందని మండిపడ్డారు.

ఇదీ చదవండి:కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత... రేవంత్ రెడ్డికి గాయం

ABOUT THE AUTHOR

...view details