తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుక పంపిణీలో వివాదం.. పరస్పరం ఇరువర్గాల దాడులు - నాగర్​కర్నూల్​ జిల్లా తాజా వార్తలు

ఇసుక పంపిణీ విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా నాగులపల్లి గ్రామంలో జరిగింది.

Conflict between the two factions over the distribution of sand
నాగర్​కర్నూల్​ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

By

Published : Mar 27, 2021, 4:24 AM IST

ఇసుక పంపిణీ వివాదంలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా నాగులపల్లి గ్రామంలో జరిగింది. నిందితులపై కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పికెట్​ నిర్వహించారు.

జిల్లాలోని నాగులపల్లి గ్రామంలో చెలరేగిన ఇసుక పంపిణీ వివాదంలో ఒక వర్గం వారు మరో వర్గంవారిపై రాళ్లు, కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ప్రత్యర్థుల ఇళ్లలోకి చొరబడిన కొందరు వ్యక్తులు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనంపై కిరోసిన్​ పోసి నిప్పంటించారు. ప్రాణ భయంతో మహిళలు బయటకు పరుగులు తీశారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్​ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై ఓబుల్​రెడ్డి తెలిపారు.

ఇసుక పంపిణీలో వివాదం.. పరస్పరం ఇరువర్గాల దాడులు

ఇదీ చదవండి:లారీని ఢీకొట్టిన టాటా ఏస్​ వాహనం.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details