నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఎల్.శర్మన్ చౌహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వార్డులో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7గంటల సమయంలో అదనపు కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలోను వైద్యులు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీ.. - నాగర్కర్నూలు ఆస్పత్రిని సందర్శించిన చౌహాన్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటును తక్షణమే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ శర్మన్ చౌహన్, అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
![ఆస్పత్రిలో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీ.. నాగర్కర్నూల్ వార్తలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:11:02:1620290462-tg-mbnr-2-6-collector-hospital-visit-avb-ts10050-06052021130308-0605f-1620286388-952.jpg)
ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు
ఆక్సిజన్ మానిటరింగ్ను అటెండర్స్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి వద్ద ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వారం పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి:ప్రగతి భవన్ వద్ద నర్సింగ్ అభ్యర్థుల ఆందోళన