రంగారెడ్డి జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాబార్డు 38వ వ్యవస్థాపక దినోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి కేవీకే ఉత్తమ పరిశోధన సంస్థ పురస్కారం అందించారు. నీటి సంరక్షణలో భాగంగా సూక్ష్మసేద్యం, మల్చింగ్, నీటి గుంటలు వాడకంపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా ఈ పురస్కారం లభించింది.
పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి పురస్కారం - hyderabad
నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి కేవీకే ఉత్తమ పరిశోధన సంస్థ పురస్కారం లభించింది. జిల్లా నీటి సంరక్షణపై రైతుల్లో శిక్షణ, ప్రదర్శన, అవగాహన సదస్సుల ద్వారా చైతన్యం కలిగించడం వల్ల అవార్డు అందుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న నాబార్డు 38వ వ్యవస్థాపక దినోత్సవంలో పురస్కారాన్ని అందజేశారు.

పురస్కారం అందజేత