నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలోని ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు అనురాధ అనే యువతితోపాటు రెండు ఎద్దులు మృతి చెందాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా... పురిగూడిసెపై పిడుగు పడి ఈ దారుణం జరిగింది. నిరుపేద కుటుంబంలో చేతికందొచ్చిన అమ్మాయి, వ్యవసాయం చేసుకుంటున్న రెండు ఎద్దులు మృతి చెందటం వల్ల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
సింగోటంలో విషాదం... పిడుగుపాటుకు యువతి మృతి - పిడుగుపాటుకు ఓ యువతి, రెండు ఎద్దులు మృతి...
పిడుగుపాటుకు ఓ యువతి, రెండు ఎద్దులు మృతిచెందిన విషాదకర ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో చోటుచేసుకుంది.
![సింగోటంలో విషాదం... పిడుగుపాటుకు యువతి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4702971-thumbnail-3x2-llll.jpg)
A YOUNG WOMEN AND 2 COWS DIED WITH THUNDER EFFECT