తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం

ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By

Published : Apr 21, 2019, 11:19 PM IST

వాహనాలు వేగంగా ఎదురెదురుగా  రావడం వల్లే ప్రమాదం జరిగింది : గ్రామస్థులు

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బోలెరో ఢీకొట్టిన ఘటనలో రాముడు అనే వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు,బంధువుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది. వాహనాలు వేగంగా ఎదురెదురుగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details