తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి పాలమూరుపై కరోనా పంజా.. మరో 566 కేసులు - ఉమ్మడి పాలమూరుపై కరోనా పంజా.. మరో 566 కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లాపై కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. తాజాగా మరో 566 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 10,879కి చేరింది.

566 new corona cases registered in joint mahabubnagar district
ఉమ్మడి పాలమూరుపై కరోనా పంజా.. మరో 566 కేసులు

By

Published : Aug 27, 2020, 7:39 AM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,879 మంది వైరస్​ బారినపడ్డారు. బుధవారం మరో 566 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 152, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 148, వనపర్తి జిల్లాలో 112, జోగులాంబ గద్వాలలో 107, నారాయణపేట జిల్లాలో 47 మందికి వైరస్​ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 152 కరోనా కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలోనే 62, జడ్చర్ల 31, అడ్డాకల్‌ 10, భూత్పూర్‌, గండీడ్​లలో 8 చొప్పున, దేవరకద్ర, సీసీకుంటల్లో 7 మంది చొప్పున, రాజాపూర్‌, హన్వాడల్లో 6 చొప్పున, నవాబుపేట, మూసాపేటల్లో ముగ్గురు చొప్పున, బాలనగర్‌ మండలంలో ఒక్కరికి కరోనా కోరల్లో చిక్కుకున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో..

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 148 కరోనా కేసులు వెలుగుచూడగా.. జిల్లా కేంద్రంలో 18, కల్వకుర్తి 27, తిమ్మాజీపేట 15, అచ్చంపేట 14, కోడేరు, కొల్లాపూర్‌లలో 13 చొప్పున, తెల్కపల్లి 11, లింగాల 6, తాడూర్‌, అమ్రాబాద్‌, బల్మూర్‌, బిజినేపల్లి 4 చొప్పున, వెల్దండ 3, చారకొండ, వంగూర్‌ 2 చొప్పున, ఉప్పునుంతల, ఉర్కొండ మండలాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

వనపర్తి జిల్లాలో..

వనపర్తి జిల్లాలో 111 మంది వైరస్​ బారినపడగా.. జిల్లా కేంద్రంలో 55, పెబ్బేరు 18, కొత్తకోట 9, ఘన్‌పూర్‌ 8, గోపాల్‌పేట 5, పాన్‌గల్‌ 4, పెద్దమందడి, మదనాపురంలో ఇద్దరు చొప్పున, చిన్నంబావి, రేవల్లి, వీపనగండ్లల్లో ఒక్కొక్కరికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

జోగులాంబ గద్వాల జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో 107 కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో 23, ఇటిక్యాల 15, ఐజా 14, మల్దకల్‌ 10, వడ్డేపల్లి 9, గట్టు 8, మనవపాడు, రాజోలి, క్యాతూర్‌లలో 7 చొప్పున, అలంపూర్‌ 6, ధరూర్‌ మండలంలో ఒక్కరికి కరోనా సోకింది.

నారాయణపేట జిల్లాలో..

నారాయణపేట జిల్లాలో 47 కరోనా కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో 4, నర్వ 9, ఉట్కూర్‌, కర్నేలలో 7, గుండుమాల్‌ 5, పులిమామిడి, మద్దూర్‌లలో 4 చొప్పున, ధన్వాడ, మాగనూర్‌లలో 2, దామరగిద్ద. మరికల్‌ మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారినపడ్డారు.

ఇవీ చూడండి: ఈ-ఆఫీస్​ విధానంతో పౌరులకు వేగంగా సేవలందుతాయి: గవర్నర్​

ABOUT THE AUTHOR

...view details