ఆస్తుల నమోదు ప్రక్రియ కోసం పలు చోట్ల అధికారులు, సిబ్బంది కాలినడకన కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. అడవుల గుండా ప్రయాణిస్తూ గుట్టలెక్కి వాగులు వంకలు దాటి మరీ ఇళ్లకు వెళుతున్నారు.
ఆస్తుల వివరాల కోసం అడవిలో నడక
రాష్ట్రంలో ఆస్తుల నమోదు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా పలు చోట్ల కిలోమీటర్ల మేర అడవుల్లో నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆస్తుల వివరాల కోసం అడవిలో నడక
ములుగు జిల్లా వాజేడు మండలం పొంగాల గ్రామ పంచాయితీ పరిధిలో.. ప్రత్యేకాధికారి పుష్పవతి, కార్యదర్శి శిరీష.. గుట్టలపై ఉన్న పెనుగోలు...గ్రామానికి 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఆస్తుల నమోదు చేపట్టారు.
ఇదీ చూడండి :భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం