ములుగు జిల్లా కేంద్రంలో తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని ఎంపీ బండ ప్రకాశ్ తెలిపారు. అత్యధికంగా సభ్యత్వాల నమోదు చేపట్టి కేసీఆర్కు కానుకివ్వాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ అన్నారు.
'ములుగులో అత్యధిక సభ్యత్వాలు నమోదు కావాలి' - ములుగు
ములుగు జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల భేటీకి ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. సభ్యత్వాల నమోదులో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

'ములుగులో అత్యధిక సభ్యత్వాలు నమోదవ్వాలి'