తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 2:37 PM IST

Updated : Jun 9, 2020, 2:43 PM IST

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేనా..?

ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటుపై అడుగులు ముందుకు పడట్లేదు. గతేడాదే ప్రారంభం కావాల్సి ఉన్నా... అది జరగలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా... ఈసారి తరగతుల నిర్వహణపై సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వరంగల్ పట్టణ జిల్లాలోనూ సైనిక్ స్కూల్ ఏర్పాటుకు మోక్షం కలగడంలేదు.

tribal-university-news-in-mulugu-district
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేనా..?

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేనా..?

కరోనా కారణంగా విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోంది. పరీక్షలు రద్దవడమే కాకుండా... విద్యాసంవత్సరం కూడా వెనక్కి వెళ్తోంది. ప్రారంభం కావాల్సిన విశ్వవిద్యాలయాలు ఆలస్యమవుతున్నాయి. గిరిపుత్రుల కోసం ఉద్దేశించిన గిరిజన వర్సిటీ... వైరస్‌ కారణంగా ఈ ఏడాదైనా ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఏర్పాటుకు అన్ని సిద్ధమైనా...

ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జాకారం సమీపంలో అటవీ, రెవెన్యూ శాఖకు చెందిన భూములు అనువుగా ఉన్నాయని గట్టమ్మ ఆలయం వద్ద సుమారు 500 ఎకరాల్లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేని కారణంగా... వర్సిటీ కోసం భవనాలు నిర్మిస్తున్నారు. మరోవైపు విద్యాసంవత్సరం వృథా కాకుండా... ములుగు సమీపంలోని జాకారం వద్ద ఉన్న ఐటీడీఏ వైటీసీ భవనాన్ని తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి.

తరగతులు ప్రారంభమవుతాయా?

హైదరాబాద్ హెచ్​సీయూ ఆధ్వర్యంలో పరిమిత కోర్సులతో తరగతులు కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది జూన్‌లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా... అది కార్యరూపం దాల్చలేదు. ఈసారి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా... విద్యాసంవత్సరం ప్రారంభమే అయోమయంలో పడింది. మరి ఈ ఏడాదైనా గిరిజన వర్సిటీ ఏర్పాటై... తరగతులు ప్రారంభమవుతాయా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.

సైనిక్ స్కూల్ పరిస్థితి కూడా అంతే..

వరంగల్ పట్టణ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు కూడా ముందుకు సాగట్లేదు. రెండేళ్ల క్రితమే ధర్మసాగర్‌ మండలం ఎల్కుర్తిలోని 50 ఎకరాల విస్తీర్ణంలో... సైనిక్‌ పాఠశాల ఏర్పాటు చేస్తామన్న.. అది కార్యరూపం దాల్చలేదు. ఇందుకోసం వంద కోట్లు వెచ్చించాల్సి ఉండడం... నిధుల విడుదలలో జాప్యం... సైనిక్ స్కూల్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి. కరోనా కారణంగా ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి:మనిషిని తొక్కిచంపేసిన గజరాజు

Last Updated : Jun 9, 2020, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details