తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో దొంగల చేతివాటం

గిరిజన జాతర మేడారంలో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. క్యూలైన్లలో, గద్దెల వద్ద, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నచోట బంగారు ఆభరణాలు, పర్స్​లు, చరవాణిలు తస్కరిస్తున్నారు. క్యూలైన్​లో ఓ మహిళా దొంగ.. పర్స్​ను చోరీ చేస్తుండగా పోలీస్ మిత్ర కార్యకర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

By

Published : Feb 7, 2020, 8:02 PM IST

medaram jathara
మేడారంలో దొంగలు

మేడారంలో దొంగలు తమ చోర కళను చూపిస్తున్నారు. జాతరే అదనుగా చోరీలకు పాల్పడుతున్నారు. క్యూలైన్లలో, గద్దెల వద్ద, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నచోట, తోపులాట సమయంలో దొంగలు బంగారు నగలు, పర్స్​లు, చరవాణిలు ఎత్తుకెళ్తున్నారు.

కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ బయటి ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మహిళా...పురుష దొంగలు చోరీలు చేస్తున్నారు. సరుకులు అమ్ముకోగా వచ్చిన నగదు చోరీకి గురైందని ఓ కోళ్ల దుకాణ దారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటివరకు మేడారం జాతరలో 17 చోరీ కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదు చేయని భక్తులు ఎంతో మంది ఉన్నారు. క్యూలైన్​లో ఓ మహిళా దొంగ.. పర్స్​ను చోరీ చేస్తుండగా పోలీస్ మిత్ర కార్యకర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మేడారంలో దొంగలు

ఇవీ చూడండి:'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'

ABOUT THE AUTHOR

...view details