పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు పరిధిలో గోదావరిపై ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ కోసం అటవీ భూముల బదలాయింపునకు ప్రభుత్వం తుది అనుమతులిచ్చింది.
తుపాకులగూడెం బ్యారేజీ అటవీ భూముల బదలాయింపునకు ఉత్తర్వులు - తుపాకుల గూడెం బ్యారేజి తాజా వార్తలు
ములుగు జిల్లా తుపాకులగూడెం బ్యారేజీ అటవీ భూముల బదలాయింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తుపాకుల గూడెం బ్యారేజి అటవీ భూముల బదలాయింపునకు ఉత్తర్వులు
ఈ నిర్మాణం కోసం ఏటూరు నాగారం అటవీ డివిజన్లోని 27.9133 హెక్టార్ల భూమి అవసరం కావడంతో తదనుగుణంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.రజత్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.