భానుడి ప్రభావంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాలేకపోతున్న ప్రజలకు... మంగళవారం సాయంత్రం వరుణుడు కాస్తా ఉపశమనం అందించాడు. ములుగు జిల్లా కేంద్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలకు ఊరటనిచ్చింది. మల్లంపల్లి, రామచంద్రాపూర్, లక్నవరం వంటి లోతట్టు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. వర్షంతో ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారింది.
ములుగు జిల్లాలో మోస్తరు వర్షం - weather in mulugu
ములుగు జిల్లాలో కురిసిన మోస్తరు వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో బయటకు రాలేకపోతున్న ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం అందించాడు.
ములుగు జిల్లాలో మోస్తరు వర్షం