ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గర్భిణీకి ప్రథమ చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం వెంకటాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి.
అంబులెన్స్లోనే గర్భిణీకి పురుడుపోసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం - telangana latest news
పురిటి నొప్పులతో బాధపడుతోన్న ఓ గర్భిణీకి అంబులెన్స్ సిబ్బంది ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
![అంబులెన్స్లోనే గర్భిణీకి పురుడుపోసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం గర్భిణీకి పురుడుపోసిన అంబులెన్స్ సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13172797-170-13172797-1632583995912.jpg)
గర్భిణీకి పురుడుపోసిన అంబులెన్స్ సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం
పరిస్థితిని గమనించిన అంబులెన్స్ సిబ్బంది.. చాకచక్యంగా వ్యవహరించి గర్భిణీకి సుఖ ప్రవసం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండగా.. మెరుగైన వైద్యం కోసం వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. సమయానికి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ సిబ్బందికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: HYDERABAD RAINS: హైదరాబాద్లో భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న అధికారులు