తెలంగాణ

telangana

ETV Bharat / state

'అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి' - telangana news

మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఉపయోగపడుతుందని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్​ దినోత్సవంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

Breaking News

By

Published : Jan 25, 2021, 7:48 PM IST

అర్హులైన యువతీ, యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఉపయోగపడుతుందని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఓటరు నమోదు కార్యక్రమంలో రెవెన్యూ, అంగన్వాడీ టీచర్​లతో ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకి బహుమతులు అందజేశారు.

జాతీయ ఓటర్​ దినోత్సవంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మార్వో సత్యనారాయణతో పాటు మరికొంత మంది ఉద్యోగులకు అవార్డు అందించారు. సీనియర్ సిటిజన్స్​ని సన్మానించారు.

బాలికల సమస్యలపై ఆరా..

అంగన్వాడి టీచర్లతో కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. బాలల హక్కులపై, మైనార్టీ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై అడిగి తెలుసుకున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బాలికలపై జరుగుతున్న దాడులపై గ్రామ ప్రజలతో అవగాహన కల్పించాలని, మైనార్టీ బాలికలకు వివాహం జరగకుండా చూడాలని, డీడబ్ల్యూఓ ప్రేమలత సూచించారు.

ఇదీ చూడండి:'లైంగిక వేధింపులపై హైకోర్టు తీర్పు దారుణం'

ABOUT THE AUTHOR

...view details