తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య - పట్టణ కేంద్రంలో కాల్వలు, నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి; కలెక్టర్‌

వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు.. నీటి నిల్వ ఉండకుండా పట్టణ కేంద్రంలో కాల్వలు, నీటి గుంతలు లేకుండా చూసుకోవాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. ములుగులో పర్యటించి.. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

Mullugu toured the district center .. Sanitary work was examined.
పారిశుద్ధ్యం అందరి బాధ్యత: కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

By

Published : Jun 4, 2020, 8:00 PM IST

ములుగులో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పర్యటించి.. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వీధుల వెంట తిరుగుతూ పారిశుద్ధ్య పనులు, నీటి నిల్వ ఉన్న గుంతలను త్వరగా పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. వర్ష కాలంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు.. నీటి నిల్వ ఉండకుండా పట్టణ కేంద్రంలో కాల్వలు, నీటి గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు.

పందుల వల్ల రోగాలు విజృంభిస్తాయని.. వాటిని ఊరికి దూరంగా ఉంచాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. దోమలు రాకుండా ముందస్తుగానే.. మందులు పిచికారి చేయాలని కాలువల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లి మురికి నీరు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి:డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details