ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారక్క గుడిని రేపటి నుంచి 21 రోజుల పాటు మూసివేయనున్నారు. మేడారంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మేడారంలో సమ్మక్క-సారక్క గుడి మూసివేత - ములుగు జిల్లా లేటెస్ట్ వార్తలు
రేపటి నుంచి 21 రోజుల పాటు మేడారం సమ్మక్క-సారక్క గుడిని మూసివేయనున్నారు. మేడారంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మేడారంలో సమ్మక్క-సారక్క గుడి మూసివేత
మేడారం మిని జాతర సమయంలో ఇద్దరు ఉద్యోగులకు కొవిడ్ సోకింది. దీంతో కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హనుమంతు కె.జండగె ఆదేశాల మేరకు రేపు సోమవారం నుంచి 21 రోజుల వరకు గుడి తలుపులు మూసి వేస్తున్నట్లు అధికారికంగా దేవాదాయ శాఖ అధికారి రాజేశ్వరరావు, పూజారి పెద్ద సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. ఈనెల 24న ప్రారంభమైన చిన జాతర 27న ముగిసింది.
ఇదీ చదవండి: 'పీఎస్ఎల్వీ-సీ51' విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం
Last Updated : Feb 28, 2021, 5:43 PM IST