ములుగు జిల్లాలోని ఏటూరునాగారం రేంజి కన్నాయిగూడెం అడవుల్లో నాలుగు రోజులు క్రితం పులి సంచరిస్తుందని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా బీట్ అధికారులు రాత్రి, పగలు గస్తీ కాస్తున్నారు.
'అక్కడ పులి సంచరిస్తోందనే వదంతులు నమ్మకండి' - chriutha news is mulugu district
ఏటూరునాగారం రేంజి కన్నాయిగూడెం అడవుల్లో అటవీశాఖ సిబ్బంది పర్యటించారు. ఆ ప్రాంతమంతా పరిశీలించారు. గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
!['అక్కడ పులి సంచరిస్తోందనే వదంతులు నమ్మకండి' leopard-wandering-in-aturunagaram-in-mulugu-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9155993-thumbnail-3x2-puli.jpg)
'పులికి సంబంధించిన వదంతులు నమ్మకండి'
కాపర్లు కూడా అటవీ ప్రాంతంలో వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై అటవీ శాఖ సిబ్బంది గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పులి ఈ ప్రాంతంలో ఉందా, లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పులికి సంబంధించి ఎలాంటి వదంతులు నమ్మకూడదని డీఎఫ్వో ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు.