తెలంగాణ

telangana

వరద నీటిలో బైక్​తో సహా కొట్టుకుపోయాడు..

By

Published : Aug 7, 2019, 5:11 PM IST

ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారంలో కల్వర్టు వరద నీటిలో మునిగిపోయింది. ద్విచక్రవాహనదారుడు  వాహనంతో సహా నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు చేయి..  చేయి కలిపి ఒడ్డుకు చేర్చారు.

వరద నీటిలో బైక్​తో సహా కొట్టుకుపోయాడు..

వరద నీటిలో బైక్​తో సహా కొట్టుకుపోయాడు..

ములుగు జిల్లా వాజేడు మండలంలో రాత్రి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాజేడు మండలం ధర్మారం గ్రామ శివార్లలోని కల్వర్టును వరద ముంచేసింది. వరద నీటిని ఖాతరు చేయకుండా ఓ ద్విచక్రవాహనదారుడు కల్వర్టు దాటేందుకు విఫలయత్నం చేశాడు. వరద ప్రవాహానికి అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేయడాన్ని గమనించిన స్థానికులు చేయి.. చేయి కలిపి ఒడ్డుకు చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details