ములుగు జిల్లా వాజేడు మండలంలో రాత్రి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాజేడు మండలం ధర్మారం గ్రామ శివార్లలోని కల్వర్టును వరద ముంచేసింది. వరద నీటిని ఖాతరు చేయకుండా ఓ ద్విచక్రవాహనదారుడు కల్వర్టు దాటేందుకు విఫలయత్నం చేశాడు. వరద ప్రవాహానికి అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేయడాన్ని గమనించిన స్థానికులు చేయి.. చేయి కలిపి ఒడ్డుకు చేర్చారు.
వరద నీటిలో బైక్తో సహా కొట్టుకుపోయాడు.. - bike gets dipped in flood
ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారంలో కల్వర్టు వరద నీటిలో మునిగిపోయింది. ద్విచక్రవాహనదారుడు వాహనంతో సహా నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు చేయి.. చేయి కలిపి ఒడ్డుకు చేర్చారు.

వరద నీటిలో బైక్తో సహా కొట్టుకుపోయాడు..
వరద నీటిలో బైక్తో సహా కొట్టుకుపోయాడు..
ఇవీ చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత