తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2020, 9:43 AM IST

ETV Bharat / state

టీఎస్పీఎస్సీ ఐదో బెటాలియన్ క్యాంపుపై దాడి

ములుగు జిల్లా చల్వాయిలోని టీఎస్పీఎస్సీ ఐదో బెటాలియన్​ నిర్మాణంపై నిర్వాసిత రైతులు దాడిచేశారు. వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

farmers attack on tspsc camp in mulugu
టీఎస్పీఎస్సీ ఐదో బెటాలియన్ క్యాంపుపై దాడి

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలోని టీఎస్పీఎస్సీ ఐదో బెటాలియన్ క్యాంపు నిర్మాణాలపై రైతులు దాడికి యత్నించారు.

బెటాలియన్​ నిర్మాణం కోసం సుమారు 150 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. నిర్మాణాలు మినహా మిగిలిన భూమిని తమకు అప్పగించాలంటూ రైతులు గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్లనే నిర్మాణాలపై దాడిచేసినట్లు రైతులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఏఎస్పీ సాయి చైతన్య అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. నిర్వాసితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

టీఎస్పీఎస్సీ ఐదో బెటాలియన్ క్యాంపుపై దాడి

ఇవీచూడండి:'ప్రశ్నించినందుకు రేవంత్​రెడ్డి అక్రమ అరెస్టు'

ABOUT THE AUTHOR

...view details