తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు జిల్లాలో పోలింగ్​కు సర్వం సిద్ధం

రాష్ట్రంలో ఓట్ల పండుగకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ములుగు జిల్లాలో కలెక్టర్​ సి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. పోలింగ్​ ప్రక్రియలో తప్పులు దొర్లితే సెక్టోరియల్​, ఏరియల్​ ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

By

Published : Apr 10, 2019, 7:13 PM IST

ఎన్నికల ఏర్పాట్లు

ములుగు జిల్లాలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల వద్ద సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 9 మండలాల్లో 302 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్​ సి నారాయణ రెడ్డి పంపిణీ ప్రక్రియను సమీక్షించి.. సిబ్బందికి సూచనలు చేశారు. మాక్​ పోలింగ్​లో తప్పిదాలు జరగకుండా చూడాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఏడు గంటలకు ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు.

ములుగులో ఈవీఎంల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details