ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటిల్లో... ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపలగూడెంకు చెందిన దీక్ష శ్రీ బంగారు పతకం సాధించింది. 16 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటిల్లో విజయం సాధించిన దీక్ష శ్రీని స్థానిక గ్రామ సర్పంచ్ సన్మానించారు.
దుంపలగూడెంకు చెందిన జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో దీక్షశ్రీ 6వ తరగతి చదువుతోంది. తండ్రి జగదీశ్వరరావు కరాటే మాస్టర్ కావటంతో చిన్నతనం నుంచే శిక్షణ ఇచ్చారు. దీంతో అంచెలంచెలుగా ఎదుగుతూ 2015 -16 లో మండల స్థాయి కరాటేలో పోటీల్లో విజయం సాధించింది. 2016 -17 జిల్లా స్థాయి టోర్నీలో గెలుపొందింది.