తెలంగాణ

telangana

ETV Bharat / state

'మొక్కలను కాపాడితే.. అవే మనల్ని సంరక్షిస్తాయి' - నేషనల్ ట్రీ ప్లాంటేషన్ డే తాజావార్తలు

ములుగు జిల్లాలో ట్రీ ప్లాంటేషన్ డేలో భాగంగా సీఆర్పీఎఫ్ అధికారులు మొక్కలు నాటారు. ఈరోజు నాటిన మొక్కలే రేపటి కాలానికి పర్యావరణ పరిరక్షణలో దోహదపడతాయని వెల్లడించారు.

CRPF Officers Participated in Tree Plantation day in Mulugu district
నేటి మొక్కలే... రేపటి మహావృక్షాలు

By

Published : Jul 5, 2020, 11:14 AM IST

ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరులో సీఆర్పీఎఫ్ అధికారులు మొక్కలు నాటారు. నేషనల్ ట్రీ ప్లాంటేషన్- 2020 సందర్భంగా 101 బెటాలియన్ కమాండెంట్ హరి ఓం కారే కార్యక్రమంలో హాజరయ్యారు.

ఈ రోజు నాటిన మొక్కలు రేపటి కాలంలో పర్యావరణ పరిరక్షణలో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ గణేష్ కుమార్, సీఆర్పీఎఫ్ అధికారులు, ఎస్సై తిరుపతిరావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details