ములుగు జిల్లా నీటి ఎద్దడిపై కలెక్టర్ సమీక్ష - collector
ములుగు జిల్లాలో నీటి సమస్యపై కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు.
నారాయణ రెడ్డి
By
Published : Mar 20, 2019, 10:45 PM IST
కలెక్టర్ సమీక్ష
ములుగు జిల్లా పరిపాలన కార్యాలయంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 9 మండలాల్లోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి సమస్య ఉంటే త్వరితగతిన పనులు పూర్తిచేసి గ్రామంలో నీరు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యూ.ఎస్, మిషన్ భగీరథ ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. దూర దృశ్య సమీక్ష ద్వారా భూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు.