నాలుగు రోజులపాటు వైభవంగా సాగిన... మేడారం జాతర ముగిసింది. సమ్మక్క-సారలమ్మ వనప్రవేశంతో.... తెలంగాణ కుంభమేళ పరిసమాప్తమైంది. మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను అభినందించారు.
మేడారం జాతర నిర్వహణపై సీఎం సంతృప్తి - medaram jathara latest news
మేడారం జాతర దిగ్విజయంగా జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జాతర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను సీఎం అభినందించారు.
![మేడారం జాతర నిర్వహణపై సీఎం సంతృప్తి cm-kcr-satisfy-with-medaram-jathara-organizing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6008014-775-6008014-1581180000948.jpg)
మేడారం జాతర నిర్వహణపై సీఎం సంతృప్తి
అన్ని శాఖల సమన్వయం వల్లే జాతర దిగ్విజయంగా జరిగిందని సీఎం పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారని ప్రశంసించారు.