మేడారంలో కోయదొరల సందడి మొదలైంది. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న తాళపత్రాలు, మూలికలతో వనదేవతల దీవెనలు అందిస్తామంటూ ఆకట్టుకుంటున్నారు.
వనదేవతల జాతరలో కోయదొరల జోరు
వనదేవతల దీవెనలందిస్తాం, మీ భవిష్యత్తు చెబుతామంటూ ములుగు జిల్లా మేడారం జాతరలో కోయదొరలు సందడి చేస్తున్నారు.
వనదేవతల జాతరలో కోయదొరల జోరు
జరిగింది చెబుతాం... జరగబోయేది చెబుతామంటూ సందడి చేస్తున్నారు. చెంచులు, కోయదొరలంతా సమ్మక్క, సారలమ్మలకు కులబాంధవులు అవుతారని చెబుతున్నారు. కోయలతో మేడారం జాతర మరింత వన్నె సంతరించుకుంది.
ఇదీ చదవండిఃమందేశాడు... తర్వాత విద్యుత్ స్తంభంపై చిందేశాడు..!