తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగులో మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం

మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదంటూ ములుగు జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ కుసుమ తన జన్మదినం సందర్భంగా మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు.

By

Published : Aug 21, 2019, 11:31 AM IST

ములుగులో మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం

ములుగు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ కుసుమ జగదీష్ పుట్టిన రోజు సందర్భంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వికాస తరంగిణీ సంయుక్తంగా మహిళా వికాస్ అవగాహన - చికిత్స శిబిరం నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పనిచేస్తున్న మహిళలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలనే ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కుసుమ తెలిపారు. తమ సంస్థ ద్వారా 1000కి పైగా మహిళా ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. శరీరంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంలో బయటపడతాయని.. అందుకే ఆరోగ్యంపై అశ్రద్ధ వహించరాదని త్రిదండి దేవానంద జీయర్​స్వామి తెలిపారు.

ములుగులో మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం

ABOUT THE AUTHOR

...view details