ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ బాలుడు చేయి(boy lost hand) కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నాయిగూడెం మండలం ఐలాపురం గ్రామానికి చెందిన మండపల్లి దుర్గయ్య, సమ్మక్క దంపతుల కుమారుడు నతానియేలు.. ఆగస్టు 17న స్నేహితులతో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కింద పడ్డాడి. బాలుడి చేతికి గాయమైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. బాలుడిని ఏటూరునాగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు ప్రాథమిక చికిత్స చేసి(boy lost hand) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టువేసి పంపించారు.
చేయి కుళ్లిపోయింది
అనంతరం నాలుగు రోజులకు చేయి వాపు పెరిగి, నొప్పి తీవ్రం కావడంతో మళ్లీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరిశీలించి చేయి కుళ్లిపోయిందని(boy lost hand).. ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు పరిశీలించి మరో ఎముకల ఆస్పత్రిని సూచించారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి చేతిని తొలగించారు.