తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో 3డీ స్క్రీన్లు... భలే మంచి చౌక బేరం

మేడారం జాతర పలువురికి ఉపాధి కల్పిస్తోంది. నాలుగురోజుల పాటు జరిగే జాతరను నమ్ముకుని అనేక మంది చిరువ్యాపారులు తమ పొట్ట నింపుకుంటున్నారు. గుంటూరుకు చెందిన ముగ్గురు యువకులు చరవాణీకి సంబంధించిన 3డీ స్క్రీన్లకు విక్రయిస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు.

By

Published : Feb 5, 2020, 3:37 PM IST

3d mobile screens selling are more demand in medaram
మేడారంలో 3డీ స్ర్కీన్లు... భలే మంచి చౌక బేరం

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు చరవాణీలో సినిమాలు సీరియల్స్​ చూడడం సర్వసాధారణమై పోయింది. అయితే మామూలుగా చరవాణీలో చూస్తే టీవీలో చూసినట్టుగా అనిపించదు. అదే 3డీ స్క్రీన్​లో చూస్తే ఆ అనుభూతే వేరు. ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు తమ ఆలోచనకు మంచి రాబడినిచ్చే ప్రాంతంగా మేడారం మహా జాతరను ఎంచుకున్నారు.

ముంబై నుంచి 3డీ స్క్రీన్​లను తీసుకొచ్చి మేడారం జాతరలో విక్రయిస్తున్నారు. 100 రూపాయలకు ఒకటి అమ్ముతుండటం వల్ల చాలా మంది భక్తులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ధర తక్కువగా ఉండడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో వాటిని కొనుగోలు చేస్తున్నారని.. దానితో తమ విక్రయాలు పెరిగాయని అమ్మకపుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మేడారంలో 3డీ స్ర్కీన్లు... భలే మంచి చౌక బేరం

ఇదీచూడండి: ఆద్యంతం.. కోలాహలమే.. నేడు సారలమ్మ ఆగమనం

ABOUT THE AUTHOR

...view details