తెలంగాణ

telangana

'కల్యాణ లక్ష్మి' దేశానికే ఆదర్శం: ఉప్పల్ ఎమ్మెల్యే

By

Published : May 7, 2021, 3:28 PM IST

ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఉప్పల్‌, కాప్రా జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ పరిధిలోని 72 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే కొనియాడారు.

Uppal MLA Beti Subhash Reddy, Kalyana Lakshmi, Shadimubarak cheques
Uppal MLA Beti Subhash Reddy, Kalyana Lakshmi, Shadimubarak cheques

తెరాస ప్రభుత్వం అమలు చేస్తోన్న కల్యాణ లక్ష్మి , షాదీముబారక్‌ పథకాలు దేశానికే ఆదర్శమని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కొనియాడారు. ఉప్పల్‌, కాప్రా జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ పరిధిలోని 72 మంది లబ్ధిదారులకు గురువారం తన క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే అన్నారు. 'భేటీ బచావో- భేటీ పడావో' అనేది కేంద్రంలో భాజపా మాటలేనని విమర్శించారు. ఆచరణలో ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే.. అందులో 500 బాలికల కోసం కేటాయించినవేనని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రభుదాస్‌, పన్నాల దేవేందర్‌రెడ్డి, పన్నాల గీత, బొంతు శ్రీదేవి, తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఈ తండ్రీకూతుళ్లు రాష్ట్రానికే గర్వకారణం: ద‌త్తాత్రేయ‌

ABOUT THE AUTHOR

...view details