జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. రామంతపూర్ డివిజన్ తెరాస అభ్యర్థి గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
రూ. 30 కోట్లతో డివిజన్ అభివృద్ధి చేశాం: తెరాస అభ్యర్థి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఐదేళ్లలో సుమారు 30 కోట్ల రూపాయలతో డివిజన్ను అభివృద్ధి చేసినట్లు రామంతపూర్ డివిజన్ తెరాస అభ్యర్థి గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు తెలిపారు.
30 కోట్లతో డివిజన్ అభివృద్ధి: తెరాస
తను గత ఐదేళ్ల కాలంలో సుమారు 30 కోట్ల రూపాయలతో డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ఇదీ చదవండి:కేంద్రానికి వ్యతిరేకంగా త్వరలోనే జాతీయ సదస్సు: కేసీఆర్