తెలంగాణ

telangana

ఆడిక్​మెట్​లో తెరాస, భాజపా నాయకుల వాగ్వాదం

By

Published : Dec 1, 2020, 4:37 PM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆడిక్​మెట్ డివిజన్​లో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని భాజపా నేత ప్రకాశ్ గౌడ్​ ఆరోపించారు.

TRS, BJP leaders clash in Aadik Met division in ghmc elections
ఆడిక్​మెట్​లో తెరాస, భాజపా నాయకుల వాగ్వాదం

గ్రేటర్‌ ఎన్నికల వేళ ముషీరాబాద్ పరిధిలోని అడిక్‌మెట్ డివిజన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డివిజన్ పరిధిలోని రాంనగర్ మీ సేవా వద్ద తెరాస, భాజపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. బయటి వ్యక్తులకు డివిజన్‌లో పనేంటని నిలదీశారు . ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పోలీసుల సమక్షంలో పరస్పరం దాడులు చేసుకున్నాయి.

తెరాస నాయకుడు సుధాకర్ గుప్తా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని భాజపా నేత ప్రకాష్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రకాష్ గౌడ్ ఆరోపించారు. బయట వ్యక్తులకు ఈ డివిజన్‌లో ఏం పని అంటూ తెరాస నేతలను ప్రకాష్ గౌడ్‌ నిలదీశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి.

ఆడిక్​మెట్​లో తెరాస, భాజపా నాయకుల వాగ్వాదం

ఇదీ చూడండి:మధ్యాహ్నం 3 వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు

ABOUT THE AUTHOR

...view details