తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2020, 3:38 PM IST

ETV Bharat / state

కుత్బుల్లాపూర్​ పరిధిలో 3 కంటైన్మెంట్​ జోన్ల ఎత్తివేత

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లో మూడు కంటైన్మెంట్ జోన్లను అధికారులు ఎత్తివేశారు. 14 రోజుల పాటు ఒక్క కరోనా పాజిటివ్​ కేసు నమోదు కాకపోవడం వల్ల ఎత్తివేసినట్లు తెలిపారు.

three containment zones opened at quthbullapur
కుత్బుల్లాపూర్​ పరిధిలో 3 కంటైన్మెంట్​ జోన్ల ఎత్తివేత

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​ పరిధిలో మూడు కరోనా కేసులు నమోదవ్వగా ఆ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా అధికారులు ప్రకటించారు. 14 రోజుల పాటు ఒక్క కరోనా పాజిటివ్​ కేసు కూడా నమోదు కాకపోవడం వల్ల కంటైన్మెంట్​ జోన్లుగా ఉన్న అపురూప కాలనీ, మోడీ బిల్డర్స్, సుభాశ్​నగర్​లపై ఉన్న ఆంక్షలు ఈరోజు ఎత్తివేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ ఆదేశానుసారం కంటైన్మెంట్​ జోన్లను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ఆంక్షలు ఎత్తివేసినా... ఆ జోన్లలోని ప్రజలు బయటకు రాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యావసరాలు, మరే ఇతర సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details