మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధి లోని ప్రేమ్ విజయ నగర్ కాలనీలో చోరీ జరిగింది. పరిసరాలను గమనించిన దుండగులు..అదును చూసి..ఓ ఇంటి కిటికీ ఊచలు కట్ చేసి అందినంత దోచుకెళ్లారు.. సుమారు పది తులాల బంగారం, ఆరు జతల కమ్మలు, వెండి,ఐదువేల రూపాయలు దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు.
కిటికీ ఊచలు కట్ చేసి చోరీ.. బంగారం,వెండి,నగదు అపహరణ - theft at malkajgiri medchal dist
కిటికీ ఊచలూ కట్ చేసి కూడా దర్జాగా దొంగతనం చేసేస్తున్నారు దుండగులు. అందినకాడికి దోచుకుని అందకుండా పరారవుతున్నారు. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
![కిటికీ ఊచలు కట్ చేసి చోరీ.. బంగారం,వెండి,నగదు అపహరణ Cut window sills and steal gold, silver and cash](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9443205-23-9443205-1604580504609.jpg)
కిటికీ ఊచలు కట్ చేసి చోరీ-బంగారం,వెండి,నగదు అపహరణ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: విషాదం: ఊబిలో పడి తాతా, మనుమడు మృతి