గురువారం మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఆమోస్ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. భౌతిక కాయానికి తెరాస నేత కె.కేశవరావు, ఎమ్మెల్సీ స్టీఫెన్, కాంగ్రెస్ నేత వీహెచ్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో పాటు పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఆమోస్ను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కుటుంబసభ్యులు, బంధువులు.. కేకేతో వాపోయారు. కనీసం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆమోస్ భౌతిక కాయానికి నేతల నివాళులు - ఆమోస్ భౌతిక కాయానికి నేతల నివాళులు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆమోస్ మృతికి అన్ని పార్టీల రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. ఆయన నివాసానికి వచ్చి.. కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఆమోస్ భౌతిక కాయానికి నేతల నివాళులు