తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు'

హైదరాబాద్ కూకట్​పల్లి శంశిగూడ గ్రామంలోని తమ స్థలంలో కొంత మంది అక్రమ కట్టడాలు చేస్తున్నారని యాజమాని నంద్యాల వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీ సర్వే పూర్తయ్యే వరకు ఆ స్థలంలో ఇతర వ్యక్తులతో కొనుగోళ్లు జరపవద్దని విజ్ఞప్తి చేశారు.

By

Published : May 4, 2019, 8:02 PM IST

అక్రమ స్థలాలను కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దు

వివాదాస్పద స్థలంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించి తమ భూమిని కాపాడాలని సర్వే నెంబర్ 45 యాజమాని నంద్యాల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కూకట్​పల్లి శంశిగూడ గ్రామంలో సర్వే నెంబర్​ 45 లో తమకు వారసత్వంగా సంక్రమించిన రెండెకరాల 30 గుంటల స్థలాన్ని ఇటీవల కొంత మంది ఆక్రమించారని వాపోయారు. సర్వే నెంబర్ 46/A పేరుతో అక్రమ కట్టడాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడీ సర్వే నిర్వహించే వరకు స్థలాన్ని యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. పదో తేదీన సర్వే పూర్తయ్యే వరకు స్థలాన్ని అలాగే ఉంచాలని, ఈ అక్రమ స్థలాలను కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని ఆయన సూచించారు.

ఏడీ సర్వే పూర్తయ్యే వరకు ఆ స్థలంలో ఇతర వ్యక్తులతో కొనుగోళ్లు జరపవద్దు : బాధితుడు

ABOUT THE AUTHOR

...view details