తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 12:02 PM IST

ETV Bharat / state

చూపరులను కట్టిపడేస్తోన్న రంగవల్లులు

సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్ జిల్లా నాగారంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

sankranthi celebrations in medchal malkajgiri
చూపరులను కట్టిపడేస్తోన్న రంగవల్లులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ గాంధీనగర్​లో శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు రంగు రంగుల ముగ్గులు వేసి అలరించారు.

పండుగ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకుచేస్తూ మహిళలు వేసిన రంగవల్లులు చూపరులను కట్టిపడేశాయి. పోటీలలో గెలుపొందిన వారికి సంస్థ ప్రతినిధులు బహుమతులను అందజేశారు.

ఇదీ చదవండి:అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ABOUT THE AUTHOR

...view details