తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల కడుపు నింపుతోన్న సైన్మా రెస్టారెంట్​ యాజమాన్యం

లాక్​డౌన్​ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు సైన్మా రెస్టారెంట్​ యాజమాన్యం ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రతిరోజు 1300 మందికి భోజనం, పండ్లను పంపిణీ చేస్తున్నారు.

By

Published : May 13, 2020, 8:01 PM IST

sainma restaurent food distribution in hyderabad
పేదల కడుపు నింపుతోన్న సైన్మా రెస్టారెంట్​ యాజమాన్యం

లాక్​డౌన్ నేపథ్యంలో మేడ్చల్​ జిల్లా కొంపల్లిలోని సైన్మా రెస్టారెంట్​ యాజమాన్యం పేదలు, వలసకూలీలు, అనాథలకు భోజనం అందిస్తోంది. రెస్టారెంట్​ ఆధ్వర్యంలో ప్రతిరోజు 1300 మందికి గత 28 రోజులుగా నాణ్యమైన భోజనం, పండ్లను అందిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర మాజీ ప్రత్యేక రక్షణ అధికారి తేజ్​దీప్​కౌర్​ బాలానగర్​లోని పేదలకు ఆహారం అందించారు. నిత్యం భోజనం సరఫరా చేస్తున్న సైన్మా రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందించారు. వీటితో పాటు సిక్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తేజ్​దీప్​కౌర్ వెల్లడించారు.

ప్రతిరోజు రెస్టారెంట్​కు సంబంధించిన యువకులు సందీప్ రెడ్డి, అక్షయ్ రెడ్డిలు వారికి తోచిన విధంగా సహాయం చేయడంతో పాటు అనేక మంది దాతలను భాగస్వామ్యం చేసి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: కాల్వల భూసేకరణకు రైతులు ముందుకు రావాలి: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details