మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు ఆపకుండా సురారం వైపు వెళ్లాడు. అతన్ని పట్టుకోవడానికి ఆ వెనకే వస్తున్న మరో బైక్పై కానిస్టేబుల్ రామచంద్రయ్య కూర్చొని వెంబడించే క్రమంలో సురారం కట్టమైసమ్మ చెరువు మలుపు వద్ద అదుపుతప్పి కింద పడ్డారు.
బైకర్ను పట్టుకోబోయి రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్కు గాయాలు - medchal latest news
ఓ ద్విచక్రవాహనదారుడిని పట్టుకోబోయి పోలీస్ కానిస్టేబుల్తోపాటు ఓ వ్యక్తి గాయపడిన ఘటన మేడ్చల్ జిల్లా సురారంలో జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
![బైకర్ను పట్టుకోబోయి రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్కు గాయాలు road accident at suraram in medchal didtrict](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6750252-thumbnail-3x2-accident.jpg)
సురారంలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్కు గాయాలు
ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలు కాగా దుండిగల్ కానిస్టేబుల్ రామచంద్రయ్య తలకు బలమైన గాయమైంది. అతడికి సురారం నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం సికింద్రాబాద్ యశోదకు తరలించారు.