తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2020, 5:16 AM IST

ETV Bharat / state

30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి: రేవంత్​ రెడ్డి

ప్రశ్నించే గొంతుకకు ఊపిరి పోయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. మల్కాజిగిరి సర్కిల్, కప్రా సర్కిల్ డివిజన్​లో రోడ్డు షో నిర్వహించారు.

revanth reddy campaign in ghmc elections in medchal district
30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి: రేవంత్​ రెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం మల్కాజిగిరి సర్కిల్, కప్రా సర్కిల్ డివిజన్​లో రోడ్డు షో పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకకు ఊపిరి పోయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రశ్నించే గొంతుకగా తనను పార్లమెంట్‌కు పంపించారని... అదే విధంగా తనకు మద్దతుగా గ్రేటర్‌లో 30 మంది కార్పొరేటర్లను గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపిస్తానన్నారు. ఐదు సంవత్సరాలు తెరాస కార్పొరేటర్లు ప్రజలను దోచుకు తిన్నారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదనకు ఎగబడ్డారని ధ్వజమెత్తారు. ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు.

30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి: రేవంత్​ రెడ్డి

ఇదీ చదవండి:మేయర్‌ పీఠమే లక్ష్యంగా భాజపా విస్తృత ప్రచారం

ABOUT THE AUTHOR

...view details