తెలంగాణ

telangana

ETV Bharat / state

'గెలిపించండి... పార్లమెంట్​లో ప్రజా సమస్యలు వినిపిస్తా'

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పరేడ్​ గ్రౌండ్​లో ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని తెరాస ప్రభుత్వం చూస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. తనను గెలిపిస్తే ప్రజా గొంతుకనై ఉంటానని హామీ ఇచ్చారు.

By

Published : Mar 26, 2019, 9:35 AM IST

Updated : Mar 26, 2019, 12:18 PM IST

పరేడ్​ గ్రౌండ్​లో రేవంత్ ప్రచారం

పరేడ్​ గ్రౌండ్​లో రేవంత్ ప్రచారం
మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. సికింద్రాబాద్​ పరేడ్ గ్రౌండ్​లో ప్రచారం నిర్వహిస్తూ యువతతో ముచ్చటించారు. ఈ మైదానంలో సచివాలయం నిర్మిస్తానని కేసీఆర్ అంటున్నారని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలనలో ఐదు సార్లు కూడా సెక్రటేరియట్​కు రాని వ్యక్తి కొత్తగా సచివాలయం నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాగొంతుకను వినిపించే నాయకుడినే ప్రజలు కోరుకుంటున్నారని... అందుకోసం తనను ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు.
Last Updated : Mar 26, 2019, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details